Showing posts with label శ్రీరామదూతం శిరసా నమామి. Show all posts
Showing posts with label శ్రీరామదూతం శిరసా నమామి. Show all posts


నిన్న ఒక ఫోన్ వచ్చింది . స్వామీ ! మీసూచన అనుసరించి ప్రదక్షినలు చేస్తున్న జంట లో అద్భుతమైన మార్పు వచ్చినది

అంటూ ఏలూరు నుంచి సదాశివరావు గారు ఆనందంగా చెప్పారు . అవునా అంతా స్వామి కృప అంటూ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను . వారు పంపిన మెయిల్ చూడండి.
============================================================

sadasiva rao

to me
show details 3:21 PM (0 minutes ago)
దుర్గేస్వరరావు గారికి నమస్కరించి వ్రాయునది .
గత నెలరోజుల క్రితం నూతనంగా వివాహం చేసుకున్నజంట ఆరు నెలలు తిరగక ముందే భయంకరమైన గొడవలతో విడిపోయ్యే పరిస్తితి వస్తే వారి జాతకాలను పరిసిలించమని పంచవటి వేదిక ద్వారా కోరాను.దానికి స్పందించిన మీరు రేమిడిగా వారిరువురిని హనుమాన్ చాలిసా పారాయణం ,మరియు ప్రదక్షిణ విదివిదానాలు తెలియ చేసారు. .చివరి ఆశగా మీ మాట గా వారిని ఒప్పించి ఆచరించేలా ఏర్పాటు చేశాను మీరు చెప్పినది చెప్పినట్లుగా ఆచరిస్తున్నారు .ఈనెలరోజులలో వారిలో ఎంతో మార్పుని చూసాను .అనునిత్యం గొడవలతో కనిపించే అజంట పరస్పర అన్యోన్యంగా వుండటం, ఇద్దరు కలిసి తిరుమల సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రసాదం ఇస్తూ సదాశివరావు గారు మేము కచ్చింతంగా విదిపోయ్యేవారమే మీరు కలగజేసుకోనకపొతే. గొడవలతో ఏమి కోల్పోయామో తలుచుకుంటే భయమేస్తుంది .అంతా భగవదేచ్చ అని సముదాయించి పంపాను .ఓ జంటను కలిపిన మీకు కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటూ ..............నమస్కారములతో ................
మీ
సదాశివరావు

---------------------------------------------------------------------------------------------------------------------

పూర్తి విషయం చూద్దాం

ఏలూరులో సత్యవతిగారని ఉన్నారు . ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకబాబు మానస అనే కూతురు . దురద్రుష్టవశాత్తూ భర్త చనిపోవటం తో ఆవిడే సంసార బాధ్యతలన్నీ చూసుకొనవలసిన పరిస్థితి . వారి భర్త స్నేహితులు ఆమెకు అందగా నిలబడి సహాయ సహకారాలు అందించారు . అదే ఊరులో ప్రకాష్ అనే యొగ్యుడు విధ్యాధికుడైన యువకునితో అమ్మాయి వివాహం తనకున్నంతలో ఘనంగానే జరిపారు. ఇరువైపుల సాంప్రదాయ కుటుంబాలే. ఒకబాధ్యతను నెరవేర్చగలిగాను అని ఊపిరిపీల్చుకుంటున్నంతలో అనూహ్యంగా కూతురి జీవితంలో అల్లకల్లోలం రేగింది . పెళ్లయి ఆరునెలలుకూడా కాలేదు తెగతెంపులు చేసుకోవాలనే స్థాయికి వివాదం పెరిగింది.
అబ్బాయి విద్యావంతుడే కాదు మమ్చి సదాచారపాలన కలవాడు . ఖచ్చితంగా ఆచారాలు పాటించాలనే పట్టుదలకలవాడు. అమ్మాయికి కాస్త ఆధునిక యుగభావాలు ఎక్కువగా అబ్బాయి . ఈపూజలూ పునస్కారాలు ఇలాచేయాలా మనసులో ఉంటే చాలదా అనుకునే తత్వం.
ఇక ఆడది ఇల్లాలుగా ఇంత్లో అలాపడుండాలి అనే ఆలోచన అబ్బాయిదైతే ,ఏమిటి ఆడమగా తేడా ఇద్దరూ సమానమే అనుకుని అంతవరకుంటె పరవాలేదు ఏంటి మగాల్లగొప్ప అనుకునే స్థాయి వ్యతిరేక భావం అమ్మాయిది . కాడికి కట్టిన ఎద్దులది చెరొక దారి ఇక బండి నడక ఎలాఉంటుంది ? అలాతయారయ్యింది .

ఇక ఇంట్లో జరగవలసిన పరిణామాలు వేగంగా జరిగాయి. అత్తామామలు నొచ్చుకున్నారు . అమ్మాయి తల్లి తన బిడ్దను రాచిఅరంపాన పెడుతున్నారని భావించింది. తమ బిడ్దను ఎదిరిస్తున్న కోడలి వల్ల అత్తామామలు ఖిన్నులయ్యారు . ఇక మాటలు తూటాలు పేలాయి . తగ్గాల్సిన అవసరం ఎవరికీ లేదనిపించింది . కలిసి ఉండటం అనవసరమనే నిర్ణయానికొచ్చారు . ఇక పెళ్ళికుదిర్చిన పెద్దలను పిలచారు అటొక ఇరవైమంది ఇటొక పదిమంది కూర్చున్నారు . ఎంత సర్దిచెప్పినా వినేస్థితి కనపడటం లేదు . పెద్దమనుషులెవరైనా ఏంచెస్తారు ? చేతైనంత వరకు కాపురం నిలబెట్టాలనే చూస్తారు . వీలుకాలేదు. అయితే అదృష్టవశాత్తూ ఈ పెద్దలలో ఒకరైన సదాశివరావుగారికి ఒక ఆలోచన వచ్చింది. మీరు ఇరువైపులా వారు కొద్దిగా ఆగండి దంపతులిద్దరితో నేను మాట్లాడతాను అని వారింటికి తీసుకెళ్లారు.
అక్కడ ఆయన మానప్రయత్నంగా అన్నికోణాలనుంచి విషయాన్ని పరిశీలించి వారికి వివరించాడు . ఎక్కడా సమస్యలేదు . కేవలం ఆభిజాత్యపోరు . అమాయకత్వం ,అవగాహనా రాహిత్యం కలగలసి సమస్య పీటముడివేసుకుంది .
ఇదేదో జాతకదోషం అనే అవగాహనకొచ్చిన ఆయన అప్పటికే తానుఉన్న పంచవటి అనే గ్రూపులో ఈవిషయం వెల్లడించారు . జాతక పొంతనలు కుదరలేదా ? వీల్లపరిస్థ్తితి ఎలా విడిపోవలసినదేనా ?అని ఆవేదన వ్యక్తం చేశారు . జాతకపొంతనలు వివాహానికి ముందుచూసుకోవాలి . విడిపోదలచుకుంటే పొమ్మనండి అని సమాధానం వచ్చింది అక్కడ పెద్దలనుంచి.

అప్పటికి పంచవటిలో నా సభ్యత్వం తొలగించలేదు . నేనూ ఈ చర్చను గమనించాను . అడిగినది నన్నుకాదు ,పైగా జాతకజ్యోతిష్యవిసయాలలో నాకంతగా ప్రవేశం కూడా లేదు. అందుకని మౌనంవహించాను . కానీ మరిక్షణం గుండెల్లోంచి అకారణంగా జాలి తన్నుకువచ్చింది . ఒక ఆడపిల్ల జీవితం విఫలమవుతుంటే ఎలా అని ? అసంకల్పితంగా నాచేతులు కీబోర్డ్ మీద ఆడాయి . అడగకుండాచెప్పకూడదు కానీ ఇది ఆడపిల్ల జీవితం అమ్మాయిచేత హనుమదుపాసన చేపించండి అని వ్రాసాను.
మరుసటిరోజు సదాశివరావుగారు ఫోన్ చేసి అడిగారు ఎలాచెపించమంతారు స్వామీ అని . అయ్యా నాకు తెలిసిన విషయం చెబుతాను . సీతారాముల వియోగాన్ని బాపిన స్వామి ,ఆశ్రయిస్తే తన భక్తులను విడిపోనివ్వడు. నేను ప్రయోగపూర్వకంగా నిరూపణలు చూసిఉన్నాను. హనుమాన్ చాలీసా పారాయణం సుందర కాండ పారాయణం తో సమానం . కనుక కఠిన నియమాలతో చాలీసాపారాయణం ,ప్రదక్షిణలు చేయమని చెప్పండి దంపతులిరువురికి అని సూచించాను.
సహృదయులైన సదాశివరావుగారికి అర్ధమైంది . ఆయన దంపతులను కూర్చోబెట్తి జాతక దోషాలవల్ల మీకు ఇలాజరుగుతున్నది . ఇలా నలభైరోజుల సాధనచేయండి . విడిపోవటానికి నలభైరోజులతరువాతైనా ఇబ్బమ్దేమీలేదుకదా ? అని వారికి చెప్పాడు . ఏముహూర్తానవిన్నారో ఇద్దరూ అంగీకరించారు .
ఇకమొదలైంది చమత్కారం . సాధన మొదలయినప్పటినుండి ద్వేశం స్థానంలో ప్రేమ పెల్లుబికటం మొదలెట్తింది ఇరువురికి . అటు అచలాకీగా పూజలు చెస్తూ ఇంటిపనిచూసుకుంటున్న కోడలిని చూసి అత్తామామా సంతోషం తో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మాఅల్లుడు బంగారం అని అత్తగారు పొంగిపోతున్నది , సాధన మొదలై ముప్పైరోజులే అయింది . మొన్న ఇరువురూ తిరుమలవెల్లి శ్రీవారిని దర్శిమ్చుకుని వచ్చారట . సదాశివరావుగారు ,ఈసాధనాకాలం తరువాత విడాకులగూర్చి ఆలోచిద్దాం అని సరదాగా అంటుంటే
చాల్లేండి . అది తలచుకుంటెనే భయంకరంగా ఉంది. ఎందుకు అలాప్రవర్తించామో మాకే అర్ధంకావటం లేదు . మీరు మాకాపురం నిలబెట్టారు అని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారట . ఆయనేమో నాకు కృతజ్ఞతలు అంటున్నారు .

మన బాస్ సంగతి నాకుతెలిసినదేగా !
బాసూ ! అసలుసంగతేమిటి చెప్పవా ? అని మనసులో ఆయనను బ్రతిమిలాడాను .
ఆయన అపారకరుణతో నామనసుకు గోచరించిన విషయం విన్నవిస్తాను

నాహం కర్తా :

పైకి సదాశివరావు గారు నాపాత్ర కనపడుతున్నాయి గాని ఇవి వాస్తవానికి బొమ్మలే . విషయం లోకొద్దాము.

మనపెద్దలు అద్భుతమైన విషయాలు చిన్నసామెతలో చెబుతారు . ఒకడి ఆస్తి ఒకడికి కావచ్చేమోగానీ ఒకడి ఆలి [భార్య] ఇంకొకడికి కాదు అని. దానినే పెద్దలు రుణానుబంధరూపేణా పశుపత్నీ సుతాలయా ....అని సూత్రీకరిస్తారు,
ఇక్కడ జాతకపొంతనలు చూసినా చూడకున్నా ఎవరికి ఎవరితో రాసిపెట్టిఉంటుందో వారితో జతగాక తప్పదు.
లోకంలో వివాహాలన్నీ ఇంతే . అయితే . ఈజీవి చెడుకర్మలు పనిచేయటం ప్రారంభిస్తే అల్లకల్లోలం ప్రారంభమై కష్టాలు మొదలవుతాయి.
ఆసమయంలో ఇతను పూర్వంచేసిన సత్ క్రియల,దేవతారాధనల పుణ్యం అక్కరకొస్తే అడ్డుపడి కాపాడుతుంది. దైవబలం తగ్గితే స్థితి దిగజారుతుంది. పరమ దయాలువైన పరమాత్మ తనభక్తున్ని తన అండకు రమ్మని ఏదో ఒకరూపేణా సంకేతం పంపుతాడు. అందుకోసం మహాత్ములే కాదు నాలాంటి అనామకుడినైనా ఉపయోగించుకుని తన సంకేతాన్ని ప్రసారం చేస్తాడు . అప్పుడు తాడందుకుంటే పైకి చేరవచ్చు. మూర్ఖంగా నిర్లక్ష్యం చేస్తే చెడుకర్మలు మరింతబలీయంగా పనిచేసి పతనావస్థకు చేరుస్థాయి. ఈ అమ్మాయి చిన్నతనంలో బాగా చాలిసా పాడుకునేదట, స్వామి వారి భక్తురాలు. పెద్దాయేకొద్దీ పుస్తకాల చదువులెక్కువై స్వామి పైగల భక్తి మరుగునపడింది. కానీ ఆపదలో ఉన్న తనభక్తురాలు తనను మరచినా తానుమాత్రం స్వామి మరువలేదు. ఇలా గుర్తుచేసి ఆశ్రయింపజేసుకుని కాపాడుతున్నాడు.

అయితే జాతక దోషాలు అని చెప్పెవి అసత్యమా అని మీరనవచ్చు. ఎన్నటికీ కాదు . అవి సత్యమే . కానీ మనం శాస్త్ర్రంయొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలి. జరగాల్సినది ఎలగూ జరుగుతుంది అని అనుకుంటే ఇక ఈశాస్త్ర్రాలను ఇచ్చిన మహర్షుల సంకల్పం అర్ధమేమిటి ? ఇవి స్కానింగ్ మిషన్ లాంటివి . రోగ నిర్ధారన జరిగాక గురువనే వైద్యుణ్ణి ఆశ్రయించి భగవత్ కృప అనే ఔషధాన్ని సేవించి స్వస్థత పొందాలనేదే ఋషిపరంపర సూచించిన బాట .
ఇప్పుడు స్వామి కృపతో కాపురాన్ని కూలకుండా కాపాడుకుంటున్న ఆయువజంటకు శుభాకాంక్షలు చెబుదాం .
సర్వేజనా సుఖినోభవంతు.


సుమారు నెలరోజుల క్రితం అనుకుంటా, గ్రూప్ లో భాగవతం ఎక్కడ దొరుకుతుంది
అంటూ అడగడం జరిగింది. సహృదయతతో చాలామంది స్పందించారు. టి.టి.డి ఆఫీస్ లో
దొరుకుతుంది అంటూ సమాచారం అందించారు. దేవుడి దయ వలన కార్తీక మాసం
మొట్టమొదటి రోజున (పాడ్యమి) ఆ భగవంతుడు, సకల వేదార్ధ స్వరూపమైన
భాగవతాన్ని నాకు అందించారు. ఈ పుస్తకం నా చేతికి రావడానికి ఈ గ్రూప్ ఒక
ముఖ్య కారణం. అందుకే మీతో ఒక విషయం పంచుకుందామని ఇది రాస్తున్నాను.మొన్న
ఆదివారం వెల్దామా వద్దా అనుకుంటూ సడెన్ గా అప్పటికప్పుడు అనుకుని
లింగంపల్లి నుండి హిమాయత్ నగర్ టి.టి.డి ఆఫీస్ కి వెల్లాను. అక్కడకి
వెళ్ళేదాక సందేహం. దొరుకుతుందో లేదో, పూణే నుండి ఇంత దూరం వచ్చాను, తీరా
దొరక్కపోతే నిరాశతో వెనక్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకుంటూ లోపలికి
వెళ్ళాను.అక్కడ చూస్తే కట్టలు కట్టలు భాగవతం సెట్లు ఉన్నాయి. నా మనస్సు
ఆనందం తో గంతులు వేసింది.అడిగాను , ఆయన అన్నాడు కదా, "బాబూ ఈ రోజు
అమావాస్య కదా రేపు వచ్చి తీసుకోండి, కేవలం ఈ పుస్తకం కోసం పూణే నుండి
వచ్చానంటున్నారు కదా, పోయి పోయి అమావాస్య రోజు ఎందుకు, ఇంతకు ముందే
ఇద్దరు వచ్చి తీసుకుందామనుకుని మళ్ళీ అమావాస్య అని గుర్తు తెచ్చుకుని
రేపు వస్తామని వెళ్ళిపోయారు, తర్వాత మీ ఇష్టం" అన్నారు. నాకు అది ఆ
భగవంతుడి సలహా లా అనిపించింది.చిన్నప్టినుండి షాడో పుస్తకాలూ, యండమూరి
పుస్తకాలూ చదివీ, చదివీ ఇప్పుడు నా గురించి చదవడం మొదలుపెడుతున్నాడు,
అలాంటిది అమావాస్య రోజు ఎందుకు,పవిత్ర కార్తీక మాసంలో ఆ పుస్తకాన్ని నాకు
అందిద్దాం అని ఆ రామ చంద్ర మూర్తీ ,రామదూత అనుకున్నారేమో అనిపించింది.

ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరూ ఎవ్వరు?
ఆ రామభద్రుడు, రామదూతేనా , లేక నా అజ్ఞానమా ? ఏమో, ఆయనకే తెలియాలి.

కానీ ఒక విషయం చెప్పాలి. నిజంగా మనం ప్రయత్నించాలి అనుకుంటే ఆ భగవంతుడే
దారి చూపిస్తాడని మాత్రం అర్ధం అయ్యింది....


మనోహర్ చెనికల

లక్నోకు దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, జలావన్ జిల్లాలోని, జగ్నేవా అనే గ్రామంలో ఉన్న పురాతన హనుమాన్ దేవాలయంలో నీటికోసం హిందువులే కాకుండా ముస్లింలు ఇంకా అన్ని మతస్థుల ప్రజలు తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఆదేవాలయంలోని బోరింగ్ నుంచి వచ్చే నీటితో ఎటువంటి వ్యాధులైనా నయమౌతున్నాయి.

నీటికోసం వచ్చిన ప్రజలు ముందుగా బోరింగ్ చుట్టూ ప్రదక్షిణలు చేసి, ప్రార్ధనలు చేసి, తదనంతరం బోరింగ్ నీరు తోడుకుంటున్నారు. రోజూ దాదాపు 1000 మంది వరకూ ప్రజలు కుల, మత, ప్రాంత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా దేవాలయానికి వస్తున్నారని అక్కడి పూజారుల కథనం బట్టి తెలుస్తుంది.

స్థానికుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ నుంచి గీతానంద్‌జీ మహరాజ్ పేరుగల ఒక ఋషి దాదాపు పది రోజుల క్రితం ఆదేవాళయానికి వచ్చారని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ ఋషిని దర్శించుకుని, ఆశీర్వాదం పొంది, ఎంతో కాలంగా తాము అనుభవిస్తున్న దీర్గకాలిక రోగాలకు విముక్తి పొందారట. ఇలా వ్యాధిగ్రస్తులైన వ్యక్తులు తండోప తండాలుగా ఋషి దర్శనార్ధం రాగా, ఆ ఋషి మీ సమస్యకు
శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చి, ఆబోరింగ్ పంప్ ను పూజించి ఇకపై ఈ బోరింగ్ నుంచి వచ్చే జలం మీ సర్వ వ్యాధులను నివారిస్తుంది అని చెప్పారట.

రయీస్ అహ్మద్ అనే ఒక ముస్లిం 10 సంవత్సరముల వయసుకల తన కుమార్తె వ్యాధి గ్రస్తురాలయి నడవలేని, తినలేని పరిస్థితిలో ఉండగా ఆమెకు రెండురోజులపాటు ఈ బోరింగ్ జలాలు త్రాగించిన పిమ్మట ఆమెకున్న సకల వ్యాధులు నశించాయని, ఆమె నడవ గలుగుతుందని, తన పనులు తాను చేసుకో గలుగుతుందని చెప్పాడు.

ఈప్రాంతపు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈవిషయంపై మాట్లాడుతూ "అన్నిమతాల ప్రజలు ఈనీటికోసం ఎగబడుతున్నారనియు, ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ప్రభుత్వానికి ఇది ఒక సవాల్ గా తయారవుతుంది" అని చెప్పారు.

పంపినవారు
మల్లావాసుబాబు,హైదరాబాద్


దైవ లీలలు ఎన్నెన్నో! మన జీవితంలో బాధలు కలిగినపుడు, మనకు ఎటు వెళ్ళాలో దారి తెలీనప్పుడు, ఆ భగవంతుని శరణు వేడితే, సకలమూ భగవత్సహాయంతోనే చక్కబడతాయి. నా జీవితంలో ఎంతో బాధల్లో, నిర్ణయాలు తీసుకోలేని సందిగ్ధ క్షణాల్లో తానే నాకు తోడుగా నిలచి, నా జీవితాన్ని ఆ అంజనేయస్వామి ఒక మలుపుని తిప్పారు. నా జీవితం ఈ రోజు ఈ మాత్రం సంతోషంగా సాగుతోందంటే, అది ఆ స్వామి చలవే.

మా నాన్నగారు నాకై చాలా పెళ్ళి సంబంధాలు వెతికారు. దాదాపు 4 ఏళ్ళ పాటు నాకు సంబంధాలు చూసారు. నా పెళ్ళికై చాలా అలోచించి, బాధపడేవారు. ఆ పరిస్థితుల్లో నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నాకు అక్కడ ఒక మంచి అతనితో పరిచయం కలిగింది. నా పై అధికారి అయిన అతను, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, కానీ ఎలా.... ఆయన్ని నేను పెళ్ళి చేసుకోవడం జరగని పని... అతని కులమూ, నా కులమూ వేరు. నేనా బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టినదాన్ని, ఆయన చూస్తే వెలమ. ఈ పొత్తు కుదిరేది కాదులే అనుకున్నాను. కానీ, ఆ ఒక్క విషయం తప్పిస్తే కాదనడానుకోవడానికి నాకు ఏ కారణమూ కనిపించలేదు. ఆ భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అనుకొని, ఒక గడువు వరకూ మా నాన్న తెచ్చిన సంబంధం ఏదీ కుదరకపోతే, ఆ వ్యక్తినే నాకు జీవిత భాగస్వామి చెయ్యాలని ఆ భగవంతుడే నిర్ణయించాడేమో అని అనుకున్నాను. అదే మాట అతనికి కూడా చెప్పాను. మళ్ళీ నాపై ఆశలు పెంచుకోవద్దని, నేను చెప్పిన గడువులోగా మా నాన్న తెచ్చిన సంబంధం ఏదైనా కుదిరితే నేను చేసుకుంటానని, నాకోసం వేచి చూడవద్దని, నా సంగతి అనిశ్చితిలో ఉంది కనుక నాకోసం అలోచించవద్దనీ చెప్పాను. అతను నాకు కూడా కుదరకుంటే... అని నవ్వి వదిలేసాడు.

విధి నాకు పరీక్ష పెట్టనే పెట్టింది. నేను అనుకున్న గడువులో మా నాన్న తెచ్చిన సంబధం ఏదీ కుదరలేదు. నాకోసం ఎదురుచూసే అతనితో జీవితం పంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన తరువాత.... ఆ విషయం మా ఇంట్లో చెప్పాను. ఏముంది, అంతా మామూలే. మా నాన్న ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నించాను. కానీ అస్సలు ఒప్పుకోలేదు. అతని ఇంట్లో కూడా అదే పరిస్థితి. పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనే ఎవరికైనా ఉంటుంది కానీ నొప్పించాలని ఏ పిల్లలకి ఉంటుంది చెప్పండి? మేమూ అలాగే అలోచించి చాలా ప్రయత్నం చేసాము. అప్పుడు నేను చాలా దిక్కుతోచని పరిస్థితిలో ప్రతి రోజూ ఒక యుగంగా ఏ రోజు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉన్నాను. మా నాన్న వదలకుండా సంబంధాలు చూస్తున్నారు. కానీ ఒక్క సంబంధం కూడా ఇంటి దాకా రాకుండా చూడు స్వామీ అని దణ్ణం పెట్టుకుంటూ ఉన్నాను. ఒక నిర్ణయం తీసుకున్నాక, ఒకరిని భర్తగా అలోచించాక ఏ ఆడపిల్ల అయినా
మరొకరితో జీవితం ఎలా పంచుకోగలదు? ఈ మాట చెప్పినా మా నాన్న కరగలేదు.

ఆ బాధలో దేవుడినే నమ్ముకున్న నేను, ప్రతీ మంగళవారం ఉపవాసం ఉండి, ఆ రోజు 108 సార్లు ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను. ఆ దేవుడికి నాపై దయ కలగలేదని బాధ పడుతూ ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మమ్మ ఒక ప్రత్యేకమైన పూజ చెప్పింది. అదేమిటంటే, 108 రోజులు, రోజుకి ఒక రకం పూలతో నీకు నచ్చిన దేవత కి పూజ చేయాలి. రోజుకి 11 పూలతో మాత్రమే (వాడినవి వాడకుండా) పూజ చేయాలని నేను అనుకున్నాను. 11 పూలే ఎందుకంటే, నేను ఆ రోజు నుంచీ 11 సార్లు హనుమాన్ చాలిసా చదవాలని నిర్ణయించుకున్నాను. అలాగే వారానికి ఒక్క రోజు కాక, ప్రతీ రోజూ 108 ప్రదక్షిణలు కూడా చేయ్యాలని అనుకున్నాను. నా పూజ మొదలు పెట్టి - రోజు కి ఒకరకం పూలతో పూజ చేస్తూనే ఉన్నాను. 108 రకాల పూలు అసలు దొరుకుతాయా? అదీ తప్పనిసరిగా ప్రతి రోజూ 11 పూలు కావాలి.... ఎంత కష్టమో చెప్పండి! కానీ ఆ భగవంతుడు మా పెళ్ళి చేసేదీ లేనిదీ ఈ 108 రోజుల్లో తేలి పోవాలని నిశ్చయించుకున్నాను.

మంచి రోజు చూసుకోని, నా పూజ మొదలు పెట్టాను. మా కాలనీ లో ఉన్న పూలు వెతికి చూసుకున్నాను. మా పక్క కాలనీ లో ప్రసన్నాంజనేయ స్వామి గుడి ఉంది. రోజూ అక్కడికి వెళ్ళి, ప్రదక్షిణలు చేసి, వస్తూ, వచ్చే దారిలో పూలు కోసి తెచ్చుకునేదాన్ని. ఒకవేళ కొత్త రకాలు ఎమైనా కనబడితే గుర్తు పెట్టుకొని, మర్రోజు ఆ కొత్త రకాలు కోసుకు వచ్చేదాన్ని. ఇళ్ళల్లో పూలే కాదు, రోడ్లకు పక్కన మున్సిపల్ వాళ్ళు వేసే చెట్ల పూలు కూడా (ఉదా: అగ్ని పూలు) ఎలాగో ఒకలా 11 పూలు కోసి తెచ్చేదాన్ని. పూల మార్కెట్టుకు వెళ్ళినపుడు, అక్కడ దొరికే పూలని కూడా కొని తెచ్చేదాన్ని (మల్లెలు, కాగడాలు, చామంతులు లాటి కొన్ని రకాలు బజారులో దొరుకుతాయి - వాటికోసం ఇళ్ళ వెంబడి తిరగడం అవసరం లేదు కదా! అయితే మార్కెట్టు లో నాకు తామర పూలు, డాలియా పూలు లాటి చాలా మంచి రకాలు కూడా దొరికాయి.) 107 రోజులు వరుసగా పూజ చేసాను. అంతలోగా మా అత్తగారి ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోవడం, నాకు వేరే మంచి ఉద్యోగం రావడం జరిగాయి. 108వ రోజు మాత్రం నాకు పెద్ద పరీక్ష నే పెట్టాడు ఆ స్వామి. ఎక్కడా కొత్త రకం పూలు దొరకలేదు. ఒక గంట సేపు తిరిగాను. ఏ వీధిలో చూసినా, అన్నీ వాడిన రకాలే కనిపిస్తున్నాయి. ఇక ఆ హనుమంతుని ధ్యనించి, మరో రెండు వీధులు వెతికి, దొరకక పోతే అస్సలు ఆయన దయ నాపై లేదు అని నిశ్చయించుకొని... ఆ రెండు వీధులూ వెతికాను. ఆఖరు వీధిలో - ఆఖరి ఇంటి ముందు - నేను వాడని పూలు - బొండు మల్లె పూలు (గులాబి రంగులో ఉంటాయి - చాలా సువాసన గా ఉంటాయి) దొరికాయి.

సంతోషంగా ఆ రోజు ఇంటికి ఆ పూలు తెచ్చాను. ఆఖరు రోజు పూజ చేసుకున్నాను ఆ తరువాత 6 నెలలు తిరిగే లోపు నేను కోరుకున్న వ్యక్తితో, మా అత్తగారి తరపు వారి అందరి ఆశీర్వాదాల మధ్యా నా పెళ్ళి జరిగింది. మా నాన్నగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆ విషయం లో బాధగా ఉన్నా, కనీసం ఒక వైపు పెద్దలైనా ఒప్పుకున్నారు కదా అని కాస్త తృప్తి పడి ఊరుకున్నాము. నా పుట్టింటికి ఇంకా రాకపోకలు లేవు కానీ మా అత్తగారు వాళ్ళు నన్ను బాగా ఆదరించడం వల్ల, ఆ లోటు ని తల్చుకోకుండా ఉండగలుగుతున్నాను. అదీ దైవానుగ్రహమే కదా!

మనం భగవంతుని నమ్మి, సర్వస్వమూ ఆయనపై వదిలి, మన~హ్స్ఫూర్తిగా శరణాగతి వేడితే, తప్పక దైవ కృప మనపై ఉంటుంది.

సర్వేజనా సుఖినోభవంతు

జై రామ భక్త హనుమాన్ !

{వ్రాసినవారు : శిరిషా మురళి ,హైదరాబాద్ }


వినుకొండ కొత్తపేటలో రమాదేవిగారనే టీచర్ గారు వుండేవారు

ఆవిడ మాకు 9 వ. తరగతిలో n.s. చెప్పేవారు. ఆవిడభర్తకు సరయిన వుద్యోగము లేక రక రకాల వృత్తులు చేస్తూ స్థిరత్వము లే కుండా వుంటుండేవారు. ఈయనకు పలు అవగుణాలు వున్నాయని చెప్పుకునేవారు. ఇద్దరు పిల్లలు కలిగినా ఈయన ప్రవర్తనలో మార్పులేకపోయినా ఆ తల్లి యెంతో సహనముతో కాపురము నెట్టు కొస్తుండేది. ఈయనకు గవర్నమెంట్ హాస్పటల్ లో పనిచేసె ఒక నర్సు తో అక్రమ సంబంధం ఏర్పడింది. అప్పటినుండి ఈవిడ పరిస్తితి దయనీయముగా మారింది. ప్రతిరోజూ తిట్టడం కొట్టడం ,విడాకు లివ్వమని వేధించడము మొదలయ్యాయి . తను సంపాదించేదేమీ లేకున్నా ఖర్చులకని వేధించి దడబూ తీసుకవెల్లి వుంపుడుగత్తెకు సరదాలు తీర్చడము ఇదీవరుస. వేధింపులు శృతి మించి పోయాయి. ఒకరాత్రి నిద్రపోతున్న ప్పుడు ఈవిడ ముఖముపై దిఁడు అదిమి చంపటానికి కూడా ప్రయత్నించాడు. పొద్దుటే ఈవిడ ఏడ్చు కుంటూ ఆ యింటి కెదురూగనే నివాసం వుంటున్న హనుమదుపాసకులు శ్రీ ప్రకాశమయ్య గారి వద్దకు వెళ్ళి విల పిస్తూ నాన్నగారూ[ఆయనను అందరము అలాగే పిలుస్తాము] నేనిక బ్రతకలేను. ఏదోరోజు మా ఆయన దుర్మార్గానికి బలవుతాను. నాబిడ్డలు పసివాళ్ళు. తల్లిలేక దిక్కులేనివారయిపోతారు. అలాగని పుట్టింటికి వెళ్ళి పలుచన కాలేను. నన్ను రక్షించండి . నాభర్త బుధ్ధమారి నా కాపురం నిలబెట్టే మార్గం చెప్పండని వేడుకున్నది. అమ్మా! కర్మఫలం ఇలా పట్టి పీడిస్తున్నప్పుడు మానవప్రయత్నాలు ఏమీ చేయలేవు. త్రికరణ శుద్ధి గానమ్మి హనుమంతుని ఆశ్రయించు అన్నారు. లాంగూల స్తోత్రం వుపదేశించి నారు. కస్టాలలో వున్నఈవిడ తీక్షణముగా సాధన సాగిస్తున్నది. ఈ సంఘటన జరిగిన రోజునుంచి తన భర్త ఇంటికి రావడము, అన్నము తినిపోవడము తప్ప పలకరించటము లేదు. ఒక రోజు రాత్రి నిద్రపోతున్న అతను చావుకేక పెట్టి మంచం మీదనుంచి ఎగిరిపడి లేచి గడగడా వణికిపోతూ భయంతో కేకలేస్తున్నాడు. ఈఅరుపులకు చూట్టుపక్కలవాళ్ళూ లేచివచ్చి ఏంజరిగింది... ఏంజరిగిందని అతనిని అడుగుతునారు .అతను వెర్రిచూపులు చూస్తూ అడిగో ఆంజనేయ స్వామి నన్ను తోకతో కొట్టాడు, అని బెంబేలెత్తి పోతున్నాడు. ఇక లాభం లేదు వీడేదో ఆంజనేయస్వామంటున్నాడూ అని వాళ్ళు అతనిని. ఎదురింట్ళోవున్న ప్రకాశమయ్య గారి వద్దకు తీసుకువచ్చారు. అతని వీపుపై చేంతాడుతో పీ కినట్లు వాతతేలి వుంది. ఆయన వచ్చిన వారిని బయటకు పంపి, ఒరే నీ పాపం పండింది. నీభార్యను వేధిస్తే నువ్వుచస్తావు. ఇప్పుడు స్వామి రక్షణలో వుంది ఆమె. బుధ్ధి మార్చుకుని ప్రవర్తించమని, చెప్పి అతని శిరస్సు పై చేయివుంచి అతను భయం తొలగించి తొలగించి పంపాడు. దెబ్బకు దెయ్యం వదలినట్లు తరువాత అతను భార్యా పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, అన్యోన్యంగా వుంటున్నారు. ఇప్పుడు ఆవిడ m.e.o.పనిచేస్తున్నారు. స్వామి పరమ భక్తురాలుగా వున్నారు.