1916 ప్రాంతంలో పావన తుంగభద్రనదీ తీరంలోని మంత్రాలయంలో జరిగిన దైవలీల
ఇది. అప్పటి మద్రాస్ డిస్ట్రిక్ట్ గజెట్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన
ప్రత్యేకత ఎమిటంటే లీలకు లోనైన వారు హిందూ మతస్తుడు కాకపోవటం.

థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారికి ప్రభుత్వం ఒక బాధ్యత అప్పజెప్పింది.
చాలా కాలం క్రితం రాఘవేంద్ర కృపా పాత్రుడైన ఒక అవధ్ నవాబు, బృందావనంలో
జరిగే పూజలకు తగిన వనరులు సమకూర్చుకోవటానికి కొంత భూమిని జాగీరుగా
ప్రకటించాడు. ఆ జాగీరును వెనక్కి తీసుకునే ఆలోచన చేసింది అప్పటి బ్రిటీషు
ప్రభుత్వం. కాని అక్కడి మఠాధిపతులు ఇతర ఆస్తికులు నిరశించడంతో ఆ విషయంపై
నివేదిక పంపమని మున్రోని ఆదేశించింది ప్రభుత్వం.

హిందూ మత సాంపదాయాలని తెలిసిన మున్రో మంత్రాలయానికి చేరుకొని అక్కడి
ఆస్తికులతో చర్చించాడు. ప్రధాన ఆలయంలోకి తన టోపీ, కాళ్ళకున్న బూట్లు
తొలగించి ప్రవేశించాడు. అక్కడ అప్పుడు జరగబోయే సంఘటనను ఆయన కలలో కూడా
వూహించి వుండడు.

ఒక్క క్షణంలో ఏదో మాయ జరిగినట్టు తన చుట్టూ వున్న మనుషులు పరిసరాలను
మరిచిపోయాడు. ఆయన ఎదురుగా వున్న రాఘవేంద్ర సమాధి బృందావనం. అటు పక్కనే
తెల్లటి గడ్డంతో, కాషాయ వస్త్రాలతో ఒక సన్యాసి. మదహాసంతో మాయ చేస్తూ
మున్రో దగ్గరకి వచ్చాడు. మంద్రంగా ఆయన గొంతు వినపడింది.

"జాగీరు ప్రభుత్వం తీసేసుకుంటే ఇక్కడ జరిగే భక్తి పూజలు, అన్న దానాలు ఏవీ
జరగవు. ఆలయం మూత పడుతుంది. ఆలయమనేది జీవత ఎడారిలో ఆధ్యాత్మిక దాహం తీర్చే
ఎండమావి లాంటిది. ప్రజల మత విశ్వాసాలను గౌరవించడం పాలకుల బాధ్యత కాదా.
అలాంటి బాధ్యత నెరవేర్చినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం
చూపిస్తారు. ఆలోచించు.." అంటూ ఆశీర్వదించాడు.

మున్రో మళ్ళీ ప్రస్తుత లోకంలో మేల్కొన్నాడు. జరిగింది చుట్టుపక్కల
వున్నవారికి చెప్పాడు. అది కలా, మాయ, భ్రమా అతనికి అర్థం కాలేదు. తలపై
చెయ్యి పెట్టుకొని చూశాడు. మంత్రాక్షతలు..!! ఆ సన్యాసి ఆశీర్వదిస్తూ తనపై
వేసినవి..!!

చూట్టూ వున్న మఠాధిపతులు, సాధువులు, భక్తులు తల వంచి మున్రోకి
నమస్కరించారు. ఏ విధంగానూ తనకి తెలిసిన తర్కాని అందని ఆ లీలని తలుస్తూ
బయటకి నడిచాడు మున్రో. ఆ సన్యాసి చెప్పిన విషయమే బ్రిటీషు ప్రభుత్వానికి
వ్రాశాడు. ప్రభుత్వం జాగీరుని వెనక్కి తీసుకునే ఆలోచన మానుకుంది. { కర్నూల్ కలెక్టర్గా ఆయన వ్రాసిన ఆ వుత్తర్వులపై తానే తరువాత మద్రాస్ గవర్నర్ గా ఆమోదించవలసి రావటం మరొక విచిత్రం]

మున్రోకి అర్థం కాని విషయం ఒకటే - ఎవరా సాధువు? తను చెయ్యాల్సిన పనికి
మార్గం చూపిన ఆ గురువెవ్వరు?


[వ్రాసినవారు. అరిపిరాల సత్యప్రసాద్]ఈ కథ కే.కే.మూర్తి అనే ఒక రచయిత వ్రాసిన పుస్తకం (The miracles of God
for the debacles of human) నుండి స్వేచానువాదం)

2 comments:

vikki said...

10 pages prints veyinchina vadiki vendi dorikindi,
100 pages prints veyinchina vadi bangaram dorikinda,
veyidhamani veyinchinavadu netturu kakku koni chanipoyadu.
ee kadhaki meru cheppina daniki tedaledu

durgeswara said...

మీరెవరో పెరుతెలవదు.

భగవన్మార్గాన్ని కూడా వ్యాపారం చేసుకోవాలనుకునే దౌర్భాగ్యులవల్ల,వాళ్లని గుడ్డిగా అనుసరించే వారి వల్ల మీరీవిధముగా భావించి వుండవచ్చు.ఇది ఒక అనామక కథ కాదు. దత్తజిల్లాల కలెక్టర్ గావుండి తరువాత మద్రాస్ గవర్నర్ గా వున్న సర్ థామస్ మన్రో గారి స్వానుభవమిది. కావాలంటే మద్రాస్ గజెట్ లో మీకు దీనికాపీలు దొరుకుతాయి చూడండి. లేకుంటే ఆగురుసార్వభౌమిని మహిమ వినాలంటే నేటి మేటి డాన్సర్ లారెన్స్ గారిని అడిగి చూడండి.

అద్భుతాలను గుడ్డిగా నమ్మొద్దు.కానీ పరిశీలించే ఓపిక లేకుంటే గుడ్డిగా విమర్శించి పాపాన్ని ఒడిగట్టు కోవద్దు.
---దుర్గేశ్వర