బస్తిపాడు గ్రామ మునుసబుగనన్న చిన్నశేషిరెడ్డి జ్యేష్ట పుత్రుడు లక్క్ష్మి కాంతా రెడ్డికి ఐదు సంవత్సరముల క్రిందట మనస్సు స్ఠాయితప్పి, అతడు పిచ్చి చేష్టలను చేయుచుండెను. అతనిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించినపట్టికిని ఏమియు ప్రయోజనము లేకుండెను.
ఏమి చేయుటకును తోచక, ఒకనాడు చిన్న శేషి రెడ్డి తన కుమారుని నాతావునకు పిలుచుకునివఛ్చి, అతిని పరిస్థిని తెలియజేసి, అందుండి బయట పడుటకు మార్గమును ప్రసాదింపుడుని విన్నవించుకొనెను. సర్వశక్తివంతమగు రామనామము ను నిండుభక్తితో జపించుచుఁడిన తమ బాధలన్నియూ తీరునని ధైర్యము చెప్పితిని
తదుపరి నేను శ్రీరాములను హృదయ పూర్వకముగా స్మరించి ధ్యానమగ్నుడనై ఒక గంటకు పైగా ఏకధారగా శక్తికిరణములను ప్రసరింపజేసితిని. అందువలన ఆయన కుమారుని మనసు ప్రశాంతతనొంది స్వాధీనములోనికి వచ్చెను.
చిన్నతనము నుండి లక్ష్మీకాంతరెడ్డి తనతండ్రి తోపాటు నావద్దకు వచ్చుచుండుటచే, అతనికి కూడ నా యందు విశ్వాసముండును. అందువలన అతనితో ' లక్క్ష్మికాంతా రెడ్డి, నీవు నా సమక్షమున అచ్చట ఎలాంటి అల్లరి చేయక మీ తండ్రి ఆజ్ఞానుసారము నకడుచుకొనవలెను. నీ మనస్సు స్థాయితప్పునను భీతి కలిగినప్పుడెల్ల, నీవు వెంటనే రామ నామమును జపించిన నీ మనస్సు తిరిగి ప్రశాంతతనొందును. నీవు నేను చెప్పిన అతడట్లుండటకు సమ్మతించెను. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుమారుడు ఏదైనా అల్లరి చేసిన నా తావునకు వెంటనె పిలుచుకొని రమ్మని చిన్నశేషి రెడ్డికి తెలిపితివి
అటు తర్వత , నేను శ్రీరామలను స్మరించి వారిని హ్రుదయ పూర్తిగ దీవించి కుంకుమ ప్రసాదమునిచ్చి పంపితిని .
తనమనస్సు స్వాధీనము తప్పుచున్నదన్న భీతి కలిగినప్పుడెల్ల లక్ష్మీ కాంతరెడ్డి వెంటనే తన గదిలోనికి పోయి నా పటము ముందు నిలుచుకుని కొంత తడువు శ్రీరామ నామమ్మును స్మరించుచుఁడెను. అప్పుడప్పుడు అతడు నాతావునకు వచ్చి నేను ధ్యానము నందుండగా నా ఎదుట కూర్చుని శ్రీరామ నామమును జపించుచుండెను. శ్రీరాముల అనుగ్రహ ప్రభావమున త్వరలోనే అతని కుండు మనోబాధంతయు నివారణమై మామూలు స్తాయిలోనికొచ్చి అంతకు ముందెన్నడూ లేని ప్రశాంతతో ఇంటిపనులన్నియూ చూచుకొను సమర్ధత కలిగెను.
[పసుపుల రామకృ ష్ణారావుగారి ,శ్రీరామ నామ మహిమ గ్రంథము నుండి]
Monday, January 12, 2009
Labels: గోవిందాశ్రిత గోకుల బృందా........
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment