పియుసి చదువుతున్నప్పటినుండి రాజేశ్వరి అనె బాలిక తన తల్లిదండ్ర్లులతో పాటు నావద్దకు వచ్చు చుండెడిది. త్వరలోనే ఆమెకు రామనామమునందు,మంచి విశ్వాసముకలిగెను. శ్రీరామానుగ్రహం వలన ఆమె వివాహము శుభకరము గా జరిగెను. అటుతరువాత కొంతకాలమునకు రాజేశ్వరియొక్క ఆరోగ్యము చెడి మిక్కిలి ప్రమాదస్థితిలో నుండుటచేత ఆమెను కర్నూల్ జనరల్ హస్పటల్ లో చేర్చిరి. అచ్చట చికిత్సవలన ఏమీ లాభం లేకుండినందున ఆమెను మరలా ఇంటికి తీసుకొనివచ్చిరి.
దినదినమునకు ఆమె బాధ ఎక్కువగుచుండెను. తుదకు రెండురోజులు పూర్తిగా నీళ్ళుత్రాగుటను కూడామాని వేసి రాత్రింబవళ్ళు విపరీతబాధపడుచుండెను. అట్లే కొంతకాలముండిన ఆమె గుండె ఆగి పోవు ప్రమదము కలుగవచ్చునని ఆమె తండ్రి భీతిల్లి నాతావునకు వచ్చి ఆమెస్థితిని తెలిపి ఆమెకేహాని లేకుండునట్లుగా దీవించుడని ఎంతో బాధతో విన్నవించుకునెను.
నేను శ్రీరాములను స్మరించి వెంటనే ధ్యాననిమగ్నుడనై ప్రశాంతశక్తి పూరిత ధ్యానకిరణములను ఆమె లోనికి పంపమొదలిడితిని. ఇట్లు సుమారు ఒక గంటకాలము గడపితిని. అదివరలో రెండురోజులుగా నిద్రాహారములు లేక మిక్కిలి బాధపడుచుండిన రాజేశ్వరికి నేను ధ్యానమును మొదలిడినప్పటినుండి యు శ్రీరామానుగ్రహము వలన మంచి నిద్రపట్టి తెల్లవారేవరకు ఆమె సుఖముగా నిద్రించెను . ఎనిమిది రోజులుగా కండ్లు తెరవబడకున్నందున ఆమె కంటి చూపుకు తీరని ప్రమాదము కలుగునేమోయని ఆమె తల్లిదండ్రులు భీతిల్లుచుండిరి.కానీ శ్రీరామానుగ్రహము ఆమె మరుసటి దినమే తన కళ్లను సునాయాసముగా తెరువగలిగెను. కంటి చూపు ఏకొంచెం చెడకుండా శ్రీరామానుగ్రహము ఆమెకున్ పూర్ణారోగ్యమును కలుగజేసి కోలుకొనులాగ చెసినది. తరువాత కాలేజీ లో చేరి సునాయాసముగా బి .ఏ. పరీక్షయందు ఉత్తీర్ణతనొంది తదుపరి ఎమ్.ఏ కూడా ఉత్తమశ్రేణిలో కృతార్ధురాలై గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ గా నియమింపబడెను.

[పసుపుల రామకృష్ణారావు,కర్నూల్ వారి శ్రీరామనామ మహిమ నుండి.]