మంచి జరిగినా చెడు జరిగినా ఎల్లప్పుడూ కృష్ణభగవానుడు నావెంటే ఉన్నాడన్న భావన ఉన్నవాడిని నేను. భగవంతుని పూర్తిగా విశ్వసించిన వానికి ఆయన లీలలు ఎప్పుడూ మనకు అవగతమవుతూ ఉంటూనే ఉంటాయి. మన మొర సహేతుకమైతే ఆయన తప్పక ఆలకిస్తాడని, తీరుస్తాడని నా నమ్మకం. మన మంచి ప్రయత్నానికి ఆయన ఆశీస్సులు కూడా తప్పక ఉంటాయనడానికి నిదర్శనంగా ఎప్పుడో కాదు ఈ టపా వ్రాయడానికి ప్ర్రారంభించడం మొదలు పెట్టడానికి "వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి" అని తలస్తూ టైపు చేస్తూ ఉండగానే టీ.వీలో గంభీర స్వరంలో ఆ శ్లోకమే వినిపించింది.
ఇక అసలు విషయానికొద్దాం.శ్రీ దుర్గేశ్వర రావు గారు దైవలీలల గురించి మీ జీవితంలో జరిగిన సంఘటనలను తెలుపమన్నారు. 5 సంవత్సరాల క్రితం మా ఊరిలో జరిగిన ఒక సంఘటన ఒకటి మీకు తెలియచేయాలనుకుంటున్నాను . "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి"
"బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు, శ్రీ వేంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు భూత భవిష్యత్కాలాలలోనూ లేడు,"
ఉండబోడన్న ప్రశస్తికి నిదర్శనంగా మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఒక మచ్చుతునక మాత్రమే. మాది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని మిట్టమీద కొట్టాలపల్లె అనే కుగ్రామం. మా గ్రామంలో ఒక చిన్నకారు రైతు ఏకైక 20 ఏళ్ళ కుమారుడు అంతుపట్టని జ్వరంతో బెంగుళూర్ మణిపాల్ హాస్పిటల్ లో చేర్పించబడ్డాడు. వైద్యులు తమ పరిశీలనలో అతనికి డెంగ్యూ జ్వరమని నిర్ధారించి icu లో ఉంచి వెంటిలేటర్ ద్వారా శ్వాసనిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగికి దాదాపు 30 సీసాలవరకు రక్తం కావాలన్నారు. విషయం తెలుసుకున్న నేను మాఊరి యువకులతో మాట్లాడి వారినందరినీ సమాయత్తం చేసి వారినందరినీ బెంగుళూరుకు తీసుకొనిపోయి వారందరితో కలిసి రక్తదానం చేసాము. బెంగుళూరులోని మాబంధువులు కూడా వచ్చి రక్తదానం చేసారు. తర్వాత రోగిని చూద్దామని లోనికి వెళ్ళాను. గ్రామంలో మా కళ్ళెదుట ఆడుతూ, పాడుతూ తిరుగుతూ అందరికీ తన చేతనైనంత సహాయం చేసే అబ్బాయి నిస్తేజంగా పడుకొనిఉన్న తీరు చూసి దుఃఖం ఆపుకోలేక కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాను.అబ్బాయితండ్రికై శ్రీనివాసుని ఎల్లప్పుడూ తలచుకుంటూ, భక్తిశ్రద్ధలతో కొలిచేవాడికి ఆపదలు సులభంగా తొలగి పోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతినిత్యం దీనజనులను కాపాడుచున్న ఆ దయాసాగరమూర్తి ,కలియుగ ప్రత్యక్ష్య దైవం శ్రీవేంకటేశ్వరున్ని నిత్యం స్మరిస్తూ స్వామి కృపకు అందరూ అర్హులు కావాలనికోరుకుంటూ………….. మీ చిలమకూరువిజయమోహన్.(లీలామోహనం) "ఆ అబ్బాయి పేరు హరిప్రసాద్. భాస్కర్ నాయుడుగారి కుమారుడు." |
Monday, December 8, 2008
Labels: గోవిందాశ్రిత గోకుల బృందా........
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
ఓం నమో వేంకటేశాయ నమః
Post a Comment