నేడు మానవుడు తానే గొప్పవాడు , దేవుడు లేదు, దయ్యము లేదు అనుకుని విర్రవీగుతున్నాడు. కాని ఈ విశ్వాన్నంతటిని నడిపించేది ఒకే శక్తి ఉంది. ఆ శక్తి నుండి ఉద్భవించిన కోట్లాది దేవతలు. మనకు నచ్చినట్లుగా వేర్వేరు పేర్లతో ఆ దేవుడిని పిలుచుకుంటాము. రాముడైనా, అల్లా ఐనా, క్రీస్తు ఐనా ఒక్కడే అని నా నమ్మకం. ఎవరికైనా నమస్కారం , పూజలు చేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. మరి ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. నేను నోములు , వ్రతాలు, ఉపవాసాలు చేయను. అలా అని నాస్తికురాలిని కాదు. మనస్పూర్తిగా నమస్కరిస్తే ఆ దేవుడు మన మనస్సులోనే ఉంటాడు అని నమ్మేదాన్ని. ఒక గృహిణిగా నా కుటుంబ బాధ్యతలే నాకు దైవపూజతో సమానం అని భావిస్తాను. అందుకే వాటికే ముందు ప్రాముఖ్యతనిస్తూ వస్తున్నా. అవి సమర్ధవంతంగా నిర్వహిస్తూ, అప్పుడప్పుడు చేతనైనంత ఇతరులకు సాయం చేయడం . ఇవన్నీ దైవభక్తి అని నమ్ముతాను.
కాని నా పిల్లల విషయంలో జరిగిన రెండు సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం వింటే ఎందరో నవ్వుకోవచ్చు. పిచ్చి సెంటిమెంట్ అని. కాని నేను ఆ దేవుడి లీలను స్వయంగా చూసినదాన్ని. మా అమ్మాయి EAMCET పరీక్ష కోసం చిల్కూరు దగ్గరలో ఉన్న కాలేజిలో సెంటర్ పడింది. అప్పుడు ఆ గుడిలో మొదటిసారిగా నేను దేవుడిని కోరుకున్నాను. మా అమ్మాయికి హైదరాబాదులో, ఫ్రీ సీట్ రావాలని. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ ఫీజ్ కట్టే పరిస్థితుల్లో లేము కాబట్టి , అమ్మాయి పెద్ద చదువులు చదవాలనే ఆశతో అలా కోరుకున్నాను. విచిత్రంగా మొదటి కౌన్సెల్లింగ్ లోనే మా అమ్మాయికి సిటీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీటొచ్చింది. ఏడాదికి 8000 మాత్రమే. అది వాళ్లకు ఏడాది స్కూలు ఫీజ్ కంటే తక్కువే. ఆ తర్వాత నేను మా అమ్మాయి కలిసి చిల్కూరు వెళ్లి 108 ప్రదక్షిణలు చేసాము. ఎలాగూ ప్రతి సంవత్సరం తిరుపతి వెళతాము. కాని ఇది మాత్రం నాకు సంబంధించి ఒక అద్భుతం. ఇప్పటికీ కూడా తను ఆ వేంకటేశ్వరుడి కరుణతో ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితిలో ఉంది.
ఇక మా అబ్బాయికి EAMCET లో చాలా ఎక్కువ ర్యాంకు వచ్చింది. అసలు అంతవరకు నంబర్లు కౌన్సెలింగుకు పిలవలేదు. ఏడాది చదువు పోయింది అనుకున్నాము. వాడు కూడా చాలా దిగాలు పడిపోయాము. డోనేషన్లు కట్టే పరిస్థితి కాదు. డిగ్రీలో చేరాలా, ఇంట్లోనే ఉండి మళ్లీ చదువుకోవాలా అని తర్జనా భర్జన పడుతున్నాడు. చివరి ప్రయత్నంగా నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గ గుడికి వెళ్లి అమ్మకు నమస్కరించి నా కొడుకుకు ఒక దారి చూపించు తల్లి వాడి భవిష్యత్తు పాడు కానివ్వకు అని వేడుకున్నాను. ప్రతి రోజు 108 ప్రదక్షిణలు 108 రోజులు చేసాను. మా అబ్బాయి 21 రోజులు చేసాడు. పాపం వాడు కూడా చాలా నిరాశగా ఉన్నాడు. అదృష్టవశాత్తు 21 రోజులు ఐన మర్నాడే పేపర్లో ఒక వార్త వచ్చింది. ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినండువల్ల మళ్లీ కౌన్సెలింగ్ కు పిలవాలి అని. అందులో మా వాడిది మొదటి రెండు రోజులలోనే ఉంది. అప్పుడు కాని మా ఇంట్లో అందరికీ మనసు కుదుటపడలేదు. మావాడి మొహంలో తిరిగి కళ వచ్చింది. అసలు సీట్ రాదనుకున్న తరుణంలో మావాడికి ఊరవతల కాలేజీ ఐనా Electronics and Instrumentation లో సీట్ వచ్చింది. అది కూడా చాలా అదృష్టం కదా. అంతా ఆ అమ్మ దయ అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ప్రతి దసరా నవరాత్రులలో ప్రతి రోజు గుడికెళతాను. నేను ఏ పని చేసినా అమ్మా నీదే భారం. నాకు ఈ పని నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి నివ్వు అని కోరుకుంటాను. అన్నీ ఆ అమ్మ చూసుకుంటుంది అనే ధైర్యం ఉంది నాకు అని చెప్పగలను. అదేంటోగాని నాకు ఆనందాన్నిచ్చే శుభవార్తలు మంగళవారాలే వస్తాయి మరి..
జ్యోతి వలబోజు...
Sunday, December 7, 2008
Labels: దుర్గ
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
నేడు మానవుడు తానే గొప్పవాడు , దేవుడు లేదు, దయ్యము లేదు అనుకుని విర్రవీగుతున్నాడు..
మీ అబిప్రాయం చాలా వరకు తప్పు. మీరన్నది నిజమే కనుక అయితే:
1. తిరుపతి దర్శన Q అన్ని కిలో మీటర్లు ఎందుకు ఉంటోంది? హుండిలో కోట్లు కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి.
2. బవిరిగడ్డం బాబాలు, చింపురి జుట్టు బగవాన్లు, పందిలా బలిసిన అమ్మలు, స్వాములు దగ్గిరకు జనం ఎందుకు విరగ బడుతున్నారు. వాళ్లు చెప్పే పిచ్చి పిచ్చి మాటలు, ఇచ్చే పిచ్చి బూడిదకి ఎందుకంత తొక్కిసలాటలు జరిగి జనాలు చస్తున్నారు. మితిమీరిన జనాలు రావడం వలెనే కదా . ఆ నాకొడుకులు అన్నన్ని కోట్లు వెనకేసుకో గలుగుతున్నారు అంటే అర్థం ఏమిటి?
౩. చేతబడులు, యజ్ఞాలూ, యాగాలు, మంత్రాలు, శాంతులు - జనం పిచ్చ, పిచ్చ గా ఎందుకు వస్తున్నారు??
కనుక గతం కంటే ఇప్పుడే ఈ భక్తీ, దేముడు, దెయ్యాలు పాపులర్.
@krishna rao jallipalli గారు, భక్తులు పెరిగారు కాని భక్తి పెరగలేదు. అందువలననే దేవుడు రోజు రోజుకి మనకు దూరం అవుతున్నాడు. ఋజువు కావాలంటే మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు గమనించండి. వెంకటేశ్వర స్వామిని మీరు ఎంత దూరం నుంచి దర్శించుకోవాలో తెలుస్తుంది.
ఇక బాబాలు, భగవాన్లు, అమ్మలు, స్వాముల విషయానికొస్తే, ప్రజలు వారినుంచి ఙ్ఞానాన్ని కాకుండా కష్టపడకుండా సొమ్ము వచ్చే ఉపాయం చెప్పమనో లేదా తమకున్న ధీర్ఘకాలిక రోగాలను చేత్తో తుడిచేసినట్టు మాయం చేయమనో వేడుకుంటున్నారు.
ప్రజలకున్న ఈ బలహీనతను సొమ్ము చేసుకోవడం కోసమే దొంగ బాబాలు, స్వాములు, అమ్మలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.
@durgeswara గారు, please remove word verification.
మనకు మన అవసరాలు తీర్చడానికి దేవుడు కావాలి.బాగుంది.ఆ అనమ్మకంలో మీకు ఆనందముంది. అదృష్టవంతులు.
@Durgeswara గారు, ఏలిన్నాటి శని ఏడెళ్ళైనా పోదంటారు. శని గురించి, శని ప్రభావం గురించి కొంచెం వివరిస్తారా.
క్రిష్ణారావు గారూ!
మిమ్మల్నిగురించి నాకు ఒక్క ముక్కతెలియదు.అయినా మీఫోటో చూసి మిమ్మల్ని మీలక్షణాలని ,వివరించి విమర్శించాననుకోండి.అది సత్యమవుతుందా? వాచాలత్వ మవుతుందా?ఇక్కడ నూటికి ౯౦ శాతం మంది భగవంతుని నమ్ముతారు.ఒఅకవేళ నమ్మకపోయిన వారిని ఏమాత్రం అగౌరవ పరచరు.వారికున్న విజ్ణ్జతను కూడ మీరు అవహేళన చేయటం చాలా పొరపాటని పించుకుంటుంది.మీరు మేధావులుగా అన్నిసమస్యలను,మూలాలను పరిష్ఖారాలను సమస్త, విషయాలను తెలిసినవారిగా భావించుకోండి.తప్పులేదు. కాని మనకు పశువులకు భిన్నంగా వున్న వాక్కును ఎలా వుపయోగించుకోవాలో తెలియనితనంలో వుండి,ఇతరుల చర్యలు తప్పులనే తీర్పు ఇవ్వగలిగే శక్తి మంతులమవునా ?కాదా అని ఆలోచించుకోకుంటే ఎలా? , మీవాఖ్య కూడా అవసరమే .ఎలా వ్రాయకూడదో ఇతరులకు తెలియజేయటానికి.ఒక వేలు లోకం వైపు చూపినది.ంఈ మిగతా నాలుగువేళ్ళు మిమ్మల్నే చూపుతున్నాయి ముందు ఆవేళ్లకు సమాధానం చెప్పి,ఆతరువాత లోకాన్ని సంస్కరించే పనిలోకి వస్తే బాగుంటూంది.తమసోమా జ్యోతిర్గమయ.మీకు క్రమేపీ అన్నిసమాధానాలు దొరుకుతాయి ,పైవాడు వేసిన టైంటేబిల్ ప్రకారం .ధన్యవాదములు
ఏడేడు పదునాలుగేల్లుంటుందట.నాగప్రసాద గారూశని ప్రభావం.కొందరికి ఏడేల్లకు పోవచ్చేమో గాని మాలాంటి అభాగ్యులకు పదునాల్గు సంవత్సరాలు .సరదాకి వ్రాశాను ఎవరూ ఏమీ అనుకోకండి.
దుర్గేశ్వర గారు.. నేనేమి తప్పుగా రాయ లేదు. నా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు. నా వ్యాఖ్య మీద దాడి చేయండి.
mIru vaaDina padajaalaM sabhyatagaa ledu. miru aarOpimchEvi harisEva lOki vachchi akkaDa charchiMchaMdi.
muMdu meekallajODumaarchaMDi. adu EramgulO vumTE lOkam aaramgulO kanapadutumdi.
ముందు మీరు కళ్ళజోడు మార్చుకోండి... ఇదెంత సభ్యతో??
లోకాన్ని సంస్కరించే పనిలోకి వస్తే బాగుంటూంది...అని నేనేమి ఆ విధంగా కంకణం కట్టుకోలేదు. అలా కట్టుకొన్న రోజున నేను కూడా (మార్గదర్శిలో చేరకుండానే) ఓ బ్లాగు మొదలు పెడతాలెండి. .
మీరు మేధావులుగా అన్నిసమస్యలను,మూలాలను పరిష్ఖారాలను సమస్త, విషయాలను తెలిసినవారిగా భావించుకోండి .. అలా బావించి కోట్లు కోట్లు సంపాయించే దొంగ బాబాలు, బగవానులు, స్వామీజీలు వేరే ఉన్నారు లెండి.
harisEva lOki vachchi akkaDa చర్చించండి .. నేను పని చేసి సంపాయించి బతికే వాడను. నాకు అంత ఆసక్తి, ఓపిక, తీరిక, అభిరుచి,సరదా ఏమి లేవు.
మీకు క్రమేపీ అన్నిసమాధానాలు దొరుకుతాయి... దొరక్క పోయినా వచ్చే ముప్పు, నష్టం, ఏమి లేవు.
క్రిష్ణారావుగారూ
నేను కళ్లజోడుమార్చండీ అన్నది.చూసే చూపునుసవరించుకోండి అనే ఉద్దేశ్యముతో.దానిలో సభ్యతలేనిదేమిటో అర్ధంకావటంలేదు.ఇక మీకు మీభావన తప్ప ఎదుట అన్నీ,అందరూ తప్పు గా అర్ధమవుతుంటే దానని చర్చించటానికి అది మనసులోభావాన్ని బయటపెడుతున్నదే తప్ప మరొకటికాదు. ఇఅక ఇక్కడ గాని బ్లాగులలో వ్రాసే ఇఅతరులెవరూ పనిచేయకుండా సంపాదించుకోకుండా బ్రతికేవారు ఎవరున్నారని మీరనుకుంటున్నారో గాని నాకెఇతే ఎవరూ అలా బ్రతికేవారు లేరనిపిస్తోంది. నావిషయములో కొస్తే పొట్టకూటికోసము బడిపంతులుగా పనిచేస్తున్న వాడిని.అలా గే ఇతరులందరికి ఎవరిపని వాల్లకుంటుంది.మీకుతీరికలేనంత పనివుంటే మరి ఇక్కడకు రావటము ,మీకు నో్టికొచ్చినది వ్రాయటము.మీవులువైన సమ్యాన్ని వృధాచేసుకుని,మాకుకూడా ఇలా అనవసర శ్రమకలిగించటము ఎందుకండి.తెలుసుకుందామన్న ఆసక్తి ఉండి మాట్లాడితే దాన్ని చర్చ అంటారు.మన మనసులోని ఆందోళనతో ప్రపంచమంతటినీ తప్పుదని తీర్పులిచ్చేస్తూ వ్రాస్తే దానిని ఏమంటారో మీకుతెలుసు. ఇక ఇంతకంటే ఇక్కడ మీలా అందరినీ తిడుతూ వ్రాయటమ్ నాచేతకాదు. నాదగ్గర చదివే విధ్యార్థులలో కొందరున్నారు.వాళ్లను ఎక్కడా చదవటమ్లేదని టౌన్ నుంచితీసుకొచ్చినాదగ్గర పడవేశారు.వాళకు చదవాలనే ఆశక్తిగాని,ఓపికగానీ లేవు .తెలుసుకుందామన్న ఆలోచన అసలులేదు.వాల్లు చదువెందుకు,ఇదెందుకు,అదెందుకని మాట్లాడటములో మాత్రందిట్టలు.అప్పుడప్పుడూ చదవండిరా నాయనా ! అని కంప్యూటర్ ముందు కూచోబెడుతున్నాను.అలాగన్న చదవటమ్లో ఆశక్తికలుగుతుందని.వాల్లయితే ఏమితెలియకపోయినా అదితప్పు ఇదితప్పు అని బ్రహ్మాండమ్గా మాట్లాడగలరు.మీకంటే తిట్లదండకం వల్లించటంలో వందశాతం పైస్తాయిలో వుంటారు.మేమురాస్తాముసార్ అంటున్నారు.వాల్లకు కూడా బ్లాగులోకిప్రవేశము కల్పించానంటే బ్రహ్మాండముగా వ్రాస్తారు మీస్తాయిలో తిట్లు. వాళ్ళకు అవితప్ప మరొకటిరావుమరి.చర్చలకు వేదికగా ఈ బ్లాగును తయారు చేయదలచుకోలేదు. కనుక హరిసేవలోకి రమ్మన్నాను.మీకు మీఅభిప్రాయాలను మార్చాలని లేనప్పుడు .మార్చుకోనందువల్ల ఏమీనష్టం లేనప్పుడు మరిక్కడికొచ్చి మీవిలువైఅన సమయాన్ని పాడుచేయకండి.మమ్మల్ని సమాధానం చెప్పకపోతే చేతకానివారంటారు కనుక పాల్గొనేలా చేసి మీఅంతవిలువైనది కాక పోయినా మా సమయము మాకు ముఖ్యమేకనుక వృధాచేయించకండి.ధన్యవాదములు.
చివరగా చిన్నవిషయము.ఈమధ్య ఒక రైతు నాకుతెలిసినాయన ఇలా అన్నాడు.మీచదువుకున్నోళ్ళు మహా మోసకారులు.దేశంలో ఎక్కడ మోసాలు చేసినా బ్యాంకులనుముంచిన,లంచాలుతీసుకున్నా,అవినీతిపరులెవరన్నా చూడు చదువుకున్నోడే.చదువుకోలేని మావంటీవాల్లు నయం ఎవరిన మోసం చేయరు అన్నాడు. ఆయన ప్రకారం మనంతా మోసగాల్లమా? చ్దువుకున్నోళ్లలో మోసగాల్లుండవచ్చు .కాని చదువుకున్న వాల్లమ్దరూ మోసగాల్లుకాదు.అయినా ఆయన తన తీర్పునిచ్చేశాడు.ఎన్ని చెప్పినా తన మనసును తప్ప [అది మోసముతో కూడుకున్నదయినా]ఇఅతరుల మాత్రము నమ్మడు,కనీసం తెలుసుకోడు. ఆయనతో మాట్లాడి లాభమేమిటి?అని నేనే నోరుమూసుకున్నా.
కృష్ణారావుగారు,,
మీరు చెప్పింది నిజమే. కాని నిజంగా దేవుని మీద భక్తితో తిరుపతికి వెళ్లే భక్తులను దోచుకుంటున్నారు. నాకు కోపంగా ఉంది ఈ విషయంలో. అలాగే బాబాలు, స్వామీజీలు విషయంలో నా అభిప్రాయం మీకు తెలిసిందే కదా.. నేను అన్నది అందరు మానవుల గురించి కాదు. నమ్మని చాలా మంది గురించి.
దుర్గేశ్వరగారు,
శాంతించండి. మీరు దీక్షలో ఉన్నారు. సంయమనం పాటించండీ. ఇక్కడ రాసింది నేను కాబట్టి కృష్ణారావుగారు నన్ను ప్రశ్నించారు. దీనికి సమాధానమివ్వడంలో ఆలస్యం చేసినందుకు క్షమించాలి.
మహేష్ ,,
నీకు నా నమ్మకం అవసరంలా కనిపించిందా.. అప్పటి నా స్థితిలో నువ్వు ఉండి ఉంటే అది అర్ధమయ్యేది. నేను ప్రతిరోజు పూజ చేస్తాను, పండగలు చేస్తాను. కాని ఇది మాత్రం లీలా భావించాను కాబట్టే ఇలా చెప్పల్సి వచ్చింది.. మా పిల్లలకు వచ్చిన ర్యాంకులకు వారీ మంచి బ్రాంచిలలో కాలేజీ సీత్లు వస్తాయనే నమ్మకం మాకు లేకుండింది. ఎవరి నమ్మకం వారిది. ఇతరులకు నష్టం కలిగించనంతవరకు.. రైట్..
Post a Comment