
పూజ్య ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు నాకు పరిచయమయ్యాక 1975 నుఁడి నన్ను భగవాన్ వెంకయ్య స్వామివారిని దర్శిఁచుకోమని చెబుతుండేవారు.కానీ నేను వారిని దర్శించులేదు. ఎందుకంటే తలుపూరు,కలిచేడు గ్రామాలకొచ్చినప్పుడు ఆయనను నేను గమనిస్తూనేవున్నాను, కాని ప్రత్యేకంగా వారికి సాష్టామ్గపడవలెనని నాకనిపించేది కాదు. కేవలము గోచి పెట్టుకుని,ఎప్పుడూ మంట[అగ్ని]ముందు కూర్చుని వుంటారు,ఆయనేభగవంతుడని అఁటే నాకు నమ్మబుద్దయ్యేది కాదు.
ఒకసారి మేము శ్రీమాష్టారి ఆజ్ఞమేరకు రాముల వారి గుడిలో సత్సఁగము చేస్తుఁటే ఒకరోజు వార్ధా గ్రామము,గాంధీగారి ఆశ్రమమునుండి ఒకసన్యాసి వచ్చి వెఁకయ్యస్వామి వారిగూర్చి అడిగాడు. వారికి శ్రీస్వామివారిని చూపేందుకు నేను కలిచేడునుండి తలుపూరికి వెళ్ళాను. మేము పొయ్యేసమయానికి ఏదో గ్రామ తగాదాలు తీర్చమని రెండుగ్రామాలప్రజలు కిటకిటలాడుతూ స్వామి పక్కనకూర్చుని వున్నారు. మేము ఆజనాన్ని చూసి దూరంగా నిలబడియున్నాము. శ్రీస్వామి వారిదగ్గరనుఁడి ఒకవ్యక్తి మావద్దకు వచ్చి కాషాయగుడ్డలున్నాయనను రమ్మన్నారని చెప్పాడు. వెళ్ళిన అతనితో ఆసన్యాసి దీక్షతీసుకున్న తేదీ ఇమరికొన్నివిషయాలి వ్రాపిఁచి ఇచ్చి చివర్లో ఇతనిని గొలగమూడి ఆయన స్నేహితుడు నీతోటివచ్చాడుఅని వ్రాపించారు. భరద్వాజ గారికంటే నాకు శ్రీస్వామివారిగూర్చి చెప్పింది గొలగమూడిలోని నాస్నేహితుడే.
తహసిల్దారుగా నుండి తరువాత సన్యసించిన ఆవచ్చిన వారు శ్రీస్వామివారి గూర్చి ఎంతోకొనియాడారు. స్వామివారు వ్రాపించిన కాగితము చదువుకు సామర్ధ్యానికి సంబంధం లేదని చెబుతున్నదని ప్రశంసించాడు.
[రచయిత గొలగమూడి వెఁకయ్యస్వామివారి చరిత్రరాసిన అంకితభక్తుడు పెసల సుబ్బరామయ్య గారు ]
Labels: జయగురుదత్తా 2 comments
Om sri sai ram my dairy:-date:08-03-08
ఈ రోజు సంక్షిప్త శ్రీరామక్రిష్ణుని జీవన చరిత్రను అర్ధం చేసుకుని నా జన్మను సార్ధకం చేసుకున్నాను.గ్రంధాన్ని పఠించే సమయమంతా ఎంతో ఆసక్తితో నా అంతఃకరణ చతుష్టయం ఒకటే అయి భక్తి పారవశ్యంలో ఉన్నాను. ఈ సమయమంతా రోమాలు నిక్కపొడుచుకునేవున్నాయి .నా మనసు దరహాసవదనీయులైన శ్రీరామక్రిష్ణుని కను కొనల వెంబడి కారే భక్తి జలాలవైపే కేంద్రీకృతమై, వివిధ నాడులలో నుంచి భక్తి, తత్పరత కలిగిన క్షణాలు అనిర్వచనీయం. శ్రీరామక్రిష్ణునికి కించిత్తైనా అహం భావం లేదు. ఈ వాక్యాలను చదివేటఫ్పుడు నా కనుల వెంబడి సద్గురువునందు అవినాభావసంబంధంతొ కూడిన ప్రేమాశ్రువులు పారినవి. శ్రీరామక్రిష్ణుని భక్తితో సేవించిన "మధుర్" అనునతనికి నా మనస్సులో పాదాభివందనం చేసాను. ఏలయన శ్రీరామక్రిష్ణుని సేవించే భాగ్యం అతనికే దక్కినది కదా. శ్రీరామక్రిష్ణుల దివ్య అనుభూతులు, విచిత్ర దర్శనాలు గాంచిన క్షణము నా మనస్సు ఆశ్చర్యంతో కూడిన మహదానందంతో ముగ్ధమయ్యేది. కామమును అహంకారమును చిత్త బేధను పొగొట్టుకోవటానికి పరమహంస చేసిన సాధన వర్ణనాతీతం. కాలక్రమేణా "నేను" అనే భావం నాశనమయ్యి వివేక వైరాగ్యాలను ఘొర తపస్సు చేత సంపాదించబడ్డ మధుర క్షణాలు అఖండం. పుట్టుకతొనే వైరాగ్యాన్ని పొందిన రామకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే అని నా ప్రగాఢ నమ్మకం. దేవి దర్శనం కోసం వేచిన సమయమంతా ఎంతో సహనంతొ, ఓర్పుతో, భౌతిక విషయాలకు అతీతుడై దేనినీ పట్టించుకోక చేసిన ధ్యానం అమొఘం. సామాన్యులకు ధ్యాన స్థితి కలుగుట ఎంత కష్టమో, గురుదేవులకు జాగృదావస్థలోకి రావటమూ అంత కంటే కష్టం. అంత సాధనతో, ప్రేమతో , తత్పరతతో భావన వుండబట్టే కదా దేవీ దర్శనాన్ని పొందింది మరి. శ్రీరామక్రిష్ణులతో పాటు శ్రీ శారదామాతనూ భగవత్ దిశలో నడిపించాడు ఆ ఈశ్వరుడు. "వివేకానందుని చూడాలని పరితపించే ఆ మనస్సు "ను చదివినప్పుడు వీరిద్దరూ ఒక్కటే అనే భావన గుండెలలో బలంగా నాటుకుంది. శ్రీరామక్రిష్ణుని మహాసమాధిని చదివే గడియలలో నా శరీరంలో నుంచి ఎవోతెలియని ప్రవాహాలు హృదయాంతరాళాలలోకి చేరి ఆ ప్రేమ కనుల ద్వారా అశ్రురూపం దాల్చింది. చాలా సేపు ఏడ్వసాగాను. కనులు ఎర్రబడి ఉబ్బినాయి. అది గమనించినప్పుడు బాహ్యస్మ్రతిలోకి వచ్చాను.చాలా సేపు ఛాయా చిత్రాన్ని చూస్తూ ఆలోచనా రహిత స్తితిని పొందాను.
ఇది శుభ దినం. ఈ జీవితంలో మరువరాని రోజు.నా అహంకారాన్ని జయించటానికి, పరిపూర్ణభక్తి బాటలో పయనించేందుకు శక్తిని ఇవ్వమని గురుదేవులనే ప్రార్ధిస్తున్నాను..
సాయిని కృష్ణునిగా ,గురుదేవులను రాధగా భావించి రాధ కోసం విలపించి నా కృష్ణుని చేర్చమన్నట్టు మనస్సు భావాస్తితిలో లగ్నమయింది.
సర్వం ఆ ఈశ్వరుడి సంకల్పమే.
[ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్ధి వ్రాసిన తన డైరి లో ఒక పేజి పంపాడు ]
Labels: జయగురుదత్తా 0 comments
