ఆశ్రితజనపోషకి ఆదిపరాశక్తి అనుగ్రహానికి ఉదాహరణ ఇది. నాపేరు సూరి వినుకొండలో రెడీమేడ్ క్లాత్ షోరూమ్ నాది. మేము ఇద్దరము అన్నదమ్ములము. మాకొక అక్కయ్య ఉన్నది .మాబావగారు గోళ్ళకోటేశ్వరరావు గారు కూడా వినుకొండలో నే ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు .అమ్మాయిల వివాహము వాల్లకు పెద్దసమస్య అయినది. పిల్లలు ఒకమోస్తరు రూపవతులే. వారికి సంబంధాలు చూడటము మొదలెట్టిన కాడనుండీ అందరూ చూస్తున్నారు,కానీ తరువాత చెబుతామని వెల్లినవారు మరలా సమాధానము పంపటము లేదు. కొందరేదో జాతక దోషాలున్నాయని ,మరికొన్ని దోషాలని శాంతులు గట్రాచేయాలంటే మా అక్కయ్య పాపం అన్నీ చేపిస్తున్నది. మాబావగారికి కొద్దిగా భవంతుడంటె శ్రద్దతక్కువ. ఏదో రమ్మని బలవంతం చేస్తే గుడికి వచ్చి మమ అంటాడు.
చూసే సంబంధాలతో విసుగొస్తున్నది. మా అక్కయ్య కుదిగులు పట్తుకుని ఆరోగ్యం చెడేలావున్నది. దీనికితోడు మరికొన్ని సమస్యలు ఇంట్లో . మేనమామలుగా మాప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఫలితం కనపడటము లేదు.
ఒకసారెందుకో నాకు మేము వెళ్ళే శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం [రవ్వవరం] అక్కయ్యవాళ్లని తీసుకెళదామనిపించింది. పోయిన దసరాకు ముందుగా కుటుంబసభ్యులమంతా వెళుతూ మా అక్కయ్యవాళ్లను కూడా రమ్మనగా ఏకళనున్నాడో మాబావగారు కూడా నేనూ వస్తానని బయలుదేరాడు.
అక్కడ పూజ అవిపూర్తి చేసాక ,దుర్గన్నయ్యను[మీకు దుర్గేశ్వర గాపరిచయం] అన్నా ! అక్కయ్యవాళ్ల సమస్య ఎలా తీరుతుంది అని అడిగాము. దాని కాయన మీరు ఇక్కడదాకా వచ్చి అమ్మనుదర్శించుకుని కూడా మీసమస్యగూర్చి బాధపడుతున్నారంటే మీరు పరిపూర్ణముగా అమ్మను ఆశ్రయించలేదని అర్ధము.అన్నారు .ఏమిచేయమంటారో చెప్పండి అన్నాము. ఎవరి కి ఆకలైతే వారే అన్నంతినాలి అనేది సూత్రం . కనుక అమ్మాయి వివాహం సమస్యను అమ్మాయే పరిష్కరించుకోవాలి. ఏ దోషాలైనా అమ్మను ఆశ్రయిస్తే తొలగిపోతాయి. అమ్మను సర్వానుల్లంఘశాసనా అని అంటారు. అమ్మ శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించ సాధ్యము కాదు అని అర్ధము. కనుక అమ్మసేవను నిష్ఠగా చేస్తే అన్ని గ్రహ దోషాలు తొలగుతాయి ,జాతకదోషాలు మిగలవు కనుక రేపు దశరా నవరాత్రులు తొ్మ్మిదిరోజులు పీఠములో ఉండి సేవచేయమను .అమ్మ మీదభారం వేయమను సంవత్సరం లో మరలా దసరాకు భర్తతో వచ్చి దర్శనం చేసుకుంటుంది. అని చెప్పారు.
మామేనకోడలు స్వాతి ఎంతో శ్రద్ధగా నవరాత్రులు లలో పీఠము లోనేవుండి సేవాకార్యక్రమాలలో పాల్గొన్నది. వచ్చిపోయే భక్తులకు అన్నాలు వడ్డించడమేకాక చిన్నపడకుండా ఎంగిలాకులు తీసివేయటం కాన్నుంచి అన్ని సేవాకార్యక్రమాలను మిగతావారితో పోటీపడి నిర్వహించింది.
అమ్మఅనుగ్రహం ,మాకు అనుకోకుండా చీరాల కుచెందిన సంబంధము కుదరటము ,మొన్న ఏడవతారీఖున అమ్మాయి వివాహము జరపటము జరిగినది.స్థితిమంతులు సాంప్రదాయముకలవారు,మంచి వ్యక్తుల సంబంధము కుదరటము అమ్మఅనుగ్రహమే.పసుపుబట్టలతో దంపతులు పీఠానికి వచ్చి అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఆశ్రయించినవారి నిఆదుకోవటములో అమ్మ దయ అపారమని మాజీవితములో నిరూపితమైనది.