ఆది మధ్యాంత రహితుడు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు మా జీవితం లో ఎల్లప్పుడూ అపారమైన ప్రేమను కురిపిస్తూ ,ఆపన్న హస్తం అందిస్తూనే వున్నాడు . ఆదేవదేవుడుఇ ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకుని తన భక్తపాలన చాటుకున్నాడు.

నాపేరు విజయ లక్ష్మి . నాభర్త పేరు దుర్గా లక్ష్మణ బాబు. మాది ప్రేమ వివాహం .ఎన్నో అవాంతరాలెదురైనా స్వామి దయవలన మా వివాహం 2002 లో ప్రశాంతం గా జరిగినది. మేము తిరుమలక్ కాలినడకనవచ్చి తలనీలాలు సమర్పించుకుని స్వామి వారి మొక్కు తీర్చుకున్నాము. ఆతరువాత మాకు 2003 లో బబు పుట్టాడు. వాడు పుట్టేముందు కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగినది మాజీవితం లో .

మేమిద్దరం బాగా చదువు కున్నప్పటికీ మా ఇద్దరికీ ఉద్యోగ విషయం లో ఇంకా స్వామి వారి అనుగ్రహం కలగలేదు. మాది పెద్ద సంసారం. ఈయన ఒక్కరే మగపిల్లవాడు మా అత్తమామలకు .నలుగురు చెల్లెల్లు .వారి లో ఇద్దరికి పెల్లిల్లయ్యాయి. ఇద్దరు ఇంఇకా చిన్నవాల్లు. మా మామగారు లేరు . కనుక బాధ్యతంతా మా ఆయనదే.

మా పెల్లై నేను కాపురానికొచ్చేటప్పటికి రెండో ఆడపడుచు ప్రసవానికి వచ్చి వున్నది. ఆ అమ్మాయికి సిజేరియన్ చేయటం వలన ఉన్న డబ్బు చాలక ,ఆ అమ్మాయి గొలుసునే తాకట్టు పెట్టి ప్రసవం చేపించాల్సి వచ్చినది.రోజులు గడుస్తున్నాయి .కష్టం గా. ఆ అమ్మాయి ప్రసవానికి చేసిన అప్పే తీరలేదు. నాకు ప్రసవ సమయము దగ్గరపడినది. ప్రేమ వివాహం కావటం వలన పుట్టింటికి పోయే అవకాశం లేదు. దాం తో ఈ బాధ్యత కూడా మావారిదే.అందువల్ల ఎవరిని అప్పుడగాలి? అనే చింతలో మేముండేవారము. అయినవారు అర్ధం చెసుకునే స్థితి లో లేరు . స్నేహితులనడుగుదామనుకుంటే మొహమాటం. మావరు " నువ్వు టెన్షన్ పదకు స్వామి వారే రక్షిస్తారు మనలను అని ధైర్యం చెబుతుండేవారు. కానీ మనిషికి సహజమైన భయం మనసులో వుంటుంది కదా?

అలాంటి స్థితిలో స్వామిని కాపాడమని ప్రార్ధిస్తూ వున్న సమయం లో స్వామి లీల ప్రారంభమైనది. ఎప్పుడో మేము కులాంతరవివాహం చేసుకున్నందుకు గాను ప్రోత్సాహక బహుమతి కోసం సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవడం వలన రూ .10000/- ఇస్తున్నామని కబురు అందింది. ఇదంతా ఆ ఆపదమొక్కులవాని దయవలనే అవసరమగు సమయానికి అందింది. మేమిద్దరం ఆ ఫీసుకు వెళ్ళి సంతకం చేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నాము.

ముండుగా ఏలూరు లోని రామచంద్రరావు పేటలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళి నమస్కరించుకుని అక్కడనుండి బాంక్ కు వెళ్ళి డబ్బుతెచ్చుకున్నాము. ఆమర్నాడే నాకు సుఖ ప్రసవమయ్యినది. అందుకే మా బాబుకు విష్ణు అని పేరు పెట్టు కున్నాము. ఆపద్భాంధవుడైన కలియుగ ప్రత్యక్ష దైవమై న శ్రీనివాసుడు ఇలా రక్షిస్తుంటాడు ఆర్తులను. కోరకనే కావలసినవన్నీ తీర్చే కరుణాంత రంగుడు ,సర్వాంతర్యామి అయిన ఆపన్న చింతామణి స్వామి . గోవిందా ........ గోవిందా ..

- పసుపులేటి విజయా దుర్గాలక్ష్మణ్ బాబు ....ఏలూరు. ప. గో . జిల్లా

ఇక్కడికొచ్చి ఏదనుకుంటే అది అయ్యేదేకదయ్యా

భక్తా గ్రేసరులకు నమస్కారము
నాపేరు కొల్లిపర సాంబశివరావు.గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామము .1993 లో నేను వెన్నునొప్పితో విపరీతమైన బాధను అనుభవిస్తున్నాను. ఎంతోమంది డాక్టర్లకు చూపించి అనేక మందులు వాడాను .ఎందరో దేవుల్లను కన్నీటితో ప్రార్ధించాను నామొరనెవరూ ఆలకించలేదు. 1993 జూన్ మాసం లో కనికి చర్ల వెంకటేశ్వర్లు గారు తెనాలి లోవున్న వెంకయ్య స్వామి వారి భక్తులు బొందిగ నరసింహరావు గారి వద్దకు తీసుకు వెల్లారు.ఆయన శనివారం ధ్యానం లో కూర్చుని భక్తుల సందేహాలకు సమాధానాలు చెబుతూ వుండేవారు.మేము వెళ్ళీ నాబాధను చెప్పగనే గొలగమూడి వెళ్ళి నిదుర చేయమని సలహా నిచ్చినారు.

గొలగమూడి ఎక్కడున్నదో తెలియదు .ఎలా వెల్లాలో తెలియదు .అని అనుకుంటుండగా తెనాలి నుండి గొలగమూడి కి స్పెషల్ టూరిష్ట్ వెలుతుందని తెలిసి విచారించగా ఐదు సీట్లు ఖాలీగా వున్నాయని చెప్పారు. వెంటనే సీట్లన్నీ తీసుకున్నాను..అనుకున్నసమయానికి గొలగమూడి వెల్లి మహాసమాధికి ప్రదక్షిణాలు చేసాము.కుటీరం లో రక్షా దారములుస్వీకరించినాము.
అక్కడవున్న స్వామి వారి శిష్యులు గురవయ్యస్వామి వారికి సమస్యను విన్నవించినాము. ఆయన తగ్గుతుంది పోరా అన్నారు. రాత్రి స్వామి వారి గుడి ముందర ఉన్న ఇసుక తిన్నెల మీద నిదురించినాము.ఎప్పుడూ సరిగా నిదురింఛని నేను ఆరోజు ఒళ్ళుమరిచి నిదురపోయాను . అర్ధరాత్రి దాటిన తరువాత వెంకయ్య స్వామివారు నా వీపు నిమురుతున్నారు. ఎంతో అద్భుతమైన స్పర్శ .కలచెదిరింది మెలకువ వచ్చింది . నిజంగానే స్వామి వారి కరస్పర్శతో నాబాధ అదృశ్యమైనది .సంపూర్ణ విశ్వాసం తో ఇక్కడకొచ్చి ఏదనుకుంటే అదెయ్యేదేకదయ్యా అని చెప్పిన స్వామి వారి వాఖ్యము నిజమయినది.
తరువాత నా వ్యాపారము కూడా కలసి వచ్చినది .బాధ తగ్గటం తో ఉత్సాహంగా వ్యాపారం చేసుకుంటున్నాను. స్వామి వారి ఆరాధన ఉత్సవాలను మొదలు పెట్టి మొదట పదకొండు మండి సాధువులకు బిక్ష ఇచ్చి నేడు వేలాదిమందికి అన్నదానం చేసేవిధంగా ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్నాము.